హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,026 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,25,007కు పెరిగాయి. ఇప్పటివరకు 4,69,007 మంది కోలుకున్నారు. ఇంకా 53,072 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 2,928కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మొత్తం 64,362 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.