హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి ధాన్యంగింజనూ కొంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాల కారణంగా రైతుల ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగానే రంగుమారిన, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని.. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలు ఆయన మాట్లాడుతూ.. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఇప్పటివరకు రూ.3,740 కోట్ల విలువైన 19.83 లక్షల టన్నుల ధాన్యం కొన్నట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని, గన్నీ బ్యాగుల కొరత లేదని పేర్కొన్నారు.