న్యూజెర్సీ, ఏప్రిల్ 9: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ యువజంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా అంబజోగై పట్టణానికి చెందిన బాలాజీ భరత్ రుద్రవర్ (32), ఆయన భార్య ఆర్తీ (30) తమ నాలుగేండ్ల కూతురుతో కలిసి న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం వారి పాప ఇంటి బాల్కనీలో ఒంటరిగా ఏడుస్తుండటం చూసిన చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటిలోకి ప్రవేశించి చూడగా భార్యాభర్తలిద్దరూ రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించారు. ఇద్దరి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2015 నుంచి బాలాజీ, ఆర్తీ అమెరికాలో ఉంటున్నారు. ఆర్తీ ప్రస్తుతం 7 నెలల గర్భవతి.