అమరావతి: పర్యావరణ హిత పర్సనల్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్ మంగళవారం సానుకూల నిర్ణయం తీసుకున్నది. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసే ప్రభుత్వోద్యోగులకు రాయితీ కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు ఉండబోవని ఆ జీవోలో స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీతోపాటు ఎస్సెల్ గ్రూప్లు విద్యుత్ స్కూటర్లు కొనుగోలు చేసే వారికి రాయితీలు కల్పిస్తాయని ఏపీ సర్కార్ తెలిపింది. సచివాలయ ఉద్యోగులతోపాటు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు పట్ల ఆసక్తి ఉన్న వారు వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు.
ప్రభుత్వోద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా రూ.2,500 ఈఎంఐ చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నది ఏపీ ప్రభుత్వం. ఈ రాయితీలతో ఆకర్షణీయమైన ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల నుంచి ఉద్యోగులు ఈ ఎలక్ట్రిక్ స్కూటీలు, బైక్లను కొనుగోలు చేయవచ్చు.
భారీ స్థాయిలో రాష్ట్రప్రభుత్వోద్యోగులు టూ వీలర్స్ కొనడం వల్ల ఆయా కంపెనీలకు రూ.500-1000 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక నియమించిన వలంటీర్లు నాలుగు నుంచి ఐదు లక్షల మంది గ్రామ కార్యదర్శులుగా పని చేస్తున్నారు.
ఉద్యోగులు తక్కువ వడ్డీరేటుపై ఈవీ టూవీలర్స్ కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టూ వీలర్స్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఏపీ సర్కార్ జత కట్టింది.
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?