నల్లగొండ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం ఉదయం కౌటింగ్ రిహార్సల్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్ సింగ్ చవాన్, ఆర్ ఓ రోహిత్ సింగ్ లు ఏర్పాట్లను, రిహార్సల్స్ ను పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాల ఉండగా 25 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్ లో 14 టేబుల్స్ పై కౌటింగ్ జరుగనుంది. మొత్తం రెండు హాల్స్ ను ఏర్పాటు చేసి ఒక్కో హాల్ లో ఏడు కౌంటింగ్ టేబుల్స్ చేంజ్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు కౌటింగ్ ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను ఓపెన్ చేసి లెక్కింపు చేపడతామని, దీంతో పాటే ఈవీఎంల లెక్కింపు కూడా మొదలు పెడతామని స్పష్టం చేశారు. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
కౌంటింగ్ హాల్లోకి, దాని ఆవరణలోకి రావాలంటే కచ్చితంగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
అందుకోసం శనివారం అధికారులకు, కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లకు, మీడియా, పోలీసు ప్రతినిధులకు కౌటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వెంటనే రిపోర్ట్ అందజేశారు. రేపు ఉదయం ఈ రిపోర్ట్ చూపిస్తేనే కౌటింగ్ హాల్ లోకి అనుమతి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు