అబుదాబి: తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబిలో ఘనీ ఉంటున్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో దేశాన్ని విడిచి పెట్టాల్సి వచ్చిందో ఈ వీడియోలో ఘనీ వివరించారు. నన్ను దేశం నుంచి ఎలా బహిష్కరించారంటే.. కనీసం కాళ్లకు ఉన్న స్లిప్పర్లను విడిచి, బూట్లు తొడుక్కునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఒకవేళ నేను అక్కడే ఉండి ఉంటే.. ఆఫ్ఘన్ల కళ్ల ముందే వాళ్లు ఎన్నుకున్న అధ్యక్షుడిని ఉరి తీసేవారు అని ఘనీ చెప్పారు. ప్రస్తుతానికి నేను ఎమిరేట్స్లోనే ఉన్నాను. దీనివల్ల అక్కడ రక్తపాతం, గందరగోళం ఆగిపోతాయి అని ఆయన అన్నారు.
అయితే తాను కార్లలో, విమానంలో పట్టనంత డబ్బుతో పారిపోయానన్న ఆరోపణలను ఘనీ ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన అన్నారు. తాను మళ్లీ ఆఫ్ఘనిస్థాన్కు వెళ్లడానికి చర్చిస్తున్నానని ఘనీ చెప్పారు. మాజీ అధ్యక్షుడు సూట్కేస్ల నిండా డబ్బుతో వెళ్లారంటూ కజకిస్థాన్లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ఆరోపణలు చేశారు. ఇక మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్తో తాలిబన్ల చర్చలను ఆయన స్వాగతించారు.