న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్డౌన్ విధిస్తారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వదంతులను కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి స్పష్టతనిచ్చింది.
దేశంలో మే 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తారని ఓ వార్తా చానెల్ ప్రసారం చేసినట్లు, ఆ క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సదరు చానెల్ స్పందిస్తూ తాము అలాంటి వార్తలు ప్రసారం చేయలేదని స్పష్టం చేసింది. లాక్డౌన్ వార్తలు అవాస్తవం.. లాక్డౌన్ విధిస్తారని కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదని పీఐబీ స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం లాక్డౌన్ అవసరం లేదని, కరోనా కేసులు అధికంగా ఉన్న ఏరియాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించాలని, మే 31 వరకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవలే కేంద్ర హోంశాఖ సూచించింది.
ఇవికూడా చదవండి..