4,50,000 రెమ్డెసివిర్ సీసాలకోసం అమెరికా, ఈజిప్టుకు చెందిన కంపెనీలకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. వీటిలో గిలీడ్ నుంచి 75,000 సీసాలు శుక్రవారంలోగా వస్తాయి.
విదేశాల నుంచి ఆక్సిజన్ను తెచ్చేందుకు భారత నౌకాదళం ప్రత్యేకంగా యుద్ధనౌకలతో స్పెషల్ ఆపరేషన్ను ప్రారంభించింది. తొలుత ఈ యుద్ధ విమానాల్లో బహ్రెయిన్, సింగపూర్, థాయ్లాండ్ నుంచి ఆక్సిజన్ను తీసుకురానున్నారు.
ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ తల్వార్-బహ్రెయిన్ నుంచి 40 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్ను ముంబై తీసుకువస్తాయి.
ఐఎన్ఎస్ జలాశ్వ-బ్యాంకాక్ నుంచి ఆక్సిజన్ను తీసుకువస్తుంది.
ఐఎన్ఎస్ ఐరావత్- సింగపూర్ నుంచి ఆక్సిజన్ను తీసుకువస్తుంది.