హైదరాబాద్ : పట్టభద్రులతోపాటు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మునుపెన్నడూ లేనివిధంగా పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వాణీదేవి విజయంతో పట్టభద్రులు టీఆర్ఎస్పై నమ్మకంతో ఓటు వేశారని స్పష్టమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో మరింత పురోగమించడం ఖాయం’ అని మహేశ్ బిగాల పేర్కొన్నారు