కొవిడ్పై జాగ్రత్తలు తీసుకోవాలి
లక్షణాలు ఉంటే సొంతవైద్యం వద్దు
పిల్లలమర్రి వరకు నాలుగులేన్ల రోడ్డు
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
మహబూబ్నగర్ రూపురేఖలు మారుస్తాం : మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మహబూబ్నగర్ టౌన్, మార్చి29:కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలు, తీవ్రత తదితర అంశాలపై వైద్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని, సొంతవైద్యం చేసుకోవద్దన్నారు. సోమవారం మహబూబ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్పై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. కేసులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కరోనా వచ్చినప్పటికీ భయపడొద్దని, అవసరమైన మందులను ఇంటికే పంపిస్తామని తెలిపారు. ఎవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించారు.
5 బస్తీ దవాఖానల ఏర్పాటు
మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో 5 బస్తీ దవాఖాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా దవాఖానలో వైద్యుల సంఖ్య, సౌకర్యాలను పెంచి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని దూద్ దవాఖాన స్థానంలో కొత్త దవాఖాన నిర్మిస్తుండగా, పాత పాలమూరు, వీరన్నపేట గేట్, తిమ్మసానిపల్లి తదితర ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా కోర్టు సము దాయంలో పార్కింగ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీఎంహెచ్వో కృష్ణ, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు ఉన్నారు.