న్యూఢిల్లీ : కరోనా వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. అత్యధికంగా బిహార్లో 111 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీలో 109, ఉత్తరప్రదేశ్లో 79 మంది, పశ్చిమ బెంగాల్లో 63 మంది, రాజస్థాన్లో 43 మంది, జార్ఖండ్లో 39 మంది, గుజరాత్లో 37, తెలంగాణలో 36 మంది, ఏపీలో 35 మంది తమిళనాడులో 32 మంది మృతి చెందారని ఐఎంఏ పేర్కొంది. కరోనా మొదటి వేవ్లో 748 మంది వైద్యులు ప్రాణాలు కరోనాకు బలయ్యారని తెలిపింది.