అమరావతి : గుంటూర్ జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. కంప్యూటర్లను, సర్వర్లను పరిశీలించేందుకు అధికారులు యత్నించగా యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్కెటింగ్ డేలా ఉండే సర్వర్లను బయట వ్యక్తులు తనిఖీ చేయడంపై నిరసన వ్యక్తం చేసింది. తనిఖీలకు బయటి వ్యక్తలు వచ్చారని యాజమాన్యం ఆరోపించింది.
ఈ క్రమంలో అధికారులు సంస్థ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. తనిఖీలకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సంగం డెయిరీలో ఆర్థిక పరమైన అక్రమాలు జరిగాయని ఫిర్యాదు రావడంతో మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత శనివారం కూడా సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.