ముంబై: అతడు చెస్లో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్. అలాంటి ప్లేయర్ను ఆ గేమ్లో అనామకుడు, ఓ వ్యాపారవేత్త ఓడించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దానికి వెనుక అసలు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. కొవిడ్ సహాయ నిధి కోసం విరాళాలు సేకరించడానికి చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్.. పలువురు సెలబ్రిటీలతో ఆదివారం చెస్ గేమ్స్ ఆడాడు. అందులో ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్ముఖ్లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే వీళ్లలో జెరోదా కంపెనీ కోఫౌండర్ అయిన నిఖిల్ కామత్.. తాను ఆడిన గేమ్లో ఆనంద్ను ఓడించాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కానీ తాజాగా అతనే దీనిపై స్పష్టతనిచ్చాడు. అందరూ నేను ఆనంద్పై గెలిచానని అనుకుంటున్నారు. కానీ గేమ్ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయంతో ఆడి నేను గెలిచాను. ఇలా చేసినందుకు క్షమించాలి అని కామత్ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ చౌహాన్ అన్నారు. చారిటీ మ్యాచ్లలో ఇలాంటివి ఊహించలేమని చెప్పారు.
మరోవైపు ఆనంద్ కూడా కామత్ స్టేట్మెంట్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ కామెంట్ చేశాడు. తాను మాత్రం నిజాయతీగా ఆడానని, ప్రతి ఒక్కరూ ఇలాగే ఆడతారని తాను అనుకున్నానని ట్వీట్ చేశాడు. చెక్మేట్ పేరుతో జరిగిన ఈ ప్రోగ్రామ్లో సెలబ్రిటీలతో ఆనంద్ ఆడిన గేమ్ల వల్ల వచ్చిన డబ్బును కొవిడ్ సహాయక నిధికి ఇవ్వనున్నారు.