పుణె: కరోనా మహమ్మారి మరోమారు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సామెతను స్ఫురణకు తెచ్చింది. తమ ఫిజికల్ ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం పట్ల విశ్వమారి స్ప్రుహ తీసుకొచ్చింది. యాక్టర్ జ్యువెల్లరీ డిజైనర్ నీలం కొఠారీ సోనీ తన భర్త కం యాక్టర్ సమీర్ సోనీ, ఎనిమిదేండ్ల పాప అహానాలకు టైం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం పెంచుకోవడానికి నీలం కొఠారీ కుటుంబం.. పుణెలోని ముల్షీ లేక్లో హెల్త్ అండ్ వెల్నెస్ రిసార్ట్ ‘ఆత్మాంతన్’ లో గడుపాలని నిర్ణయించుకున్నది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రిసార్ట్లో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.
చిన్నారులకు కుకింగ్, గార్డెనింగ్, ట్రెక్కింగ్పై తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల ఎటువంటి ఔట్ డోర్ కార్యక్రమాలకు హాజరు కానీ తమ కూతురు అహానాతోపాటు తాము మంచి అనుభవాన్ని పొందామని చెప్పారు నీలం.
ఒత్తిడితో కూడిన వాతావరణం నుంచి బయట పడేందుకు రిసార్ట్లో జరిగే కార్యక్రమాలు హాయిని ఇస్తాయని అన్నారు. మహమ్మారితో సిటీ జీవితమే మారిపోయిందని తెలిపారు. బయటకు వెళ్లడం లేదని, ఇతర వ్యక్తులను కలవడానికి భయపడాల్సి వస్తుందన్నారు.
గ్రీన్ అండ్ ఓపెన్ ఎన్విరాన్మెంట్ ప్రభావంతో నిరంతరం భయం నుంచి బయట పడొచ్చు. మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల నుంచి దూరంగా ఉంటూ ముందడగు వేసేందుకు ఈ రిసార్ట్ ఉపకరిస్తుంది. ఇది మానసిక, శరీరారోగ్యాన్ని పెంపొందిస్తుందని నీలం చెప్పారు.