ప్రభుత్వ దవాఖానలపై భరోసా కల్పించాలి
అవసరమైతే ఐసొలేషన్ కేంద్రాలు పెంచాలి
పెద్దపల్లి జిల్లా నేతలు, అధికారులతో మంత్రి కొప్పుల
జూమ్ యాప్లో కరోనా చికిత్స, లాక్డౌన్ అమలు తీరుపై సమీక్ష
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి జంక్షన్: కరోనా మహమ్మారిని పారదోలేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా నేతలు, అధికారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు భరోసా కల్పించే విధంగా వైద్య సేవలందించాలని నిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసం నుంచి వారితో వర్చువల్ విధానంలో సమావేశమయ్యా రు. కొవిడ్ చికిత్స, లాక్డౌన్ అమలు తదితర అం శాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అవరసరం మేరకు ఐసొలేషన్ కేంద్రాలను పెంచి, మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రైవేట్ దవాఖానల్లో కరోనా చికిత్స, సీటీ స్కాన్కు అధిక ఫీజుల వసూలు చేయకుండా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రెండో విడుత జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించా రు. బ్లాక్ ఫంగస్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో కొవి డ్ టెస్టుల సంఖ్య పెంచాలని, కరీంనగర్కు పంపిం చే పేషంట్లకు బెడ్ సౌకర్యం కల్పించే విధంగా చర్య లు తీసుకోవాలని ఎంపీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లు దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో కరోనా కట్ట డి, లాక్డౌన్ అమలు కు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 4,800 యాక్టివ్ కేసులున్నాయని, పాజిటివ్ రేట్ 25శాతం ఉంద ని వివరించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై దాదాపు 15వేల కేసులు నమోదు చేశామని డీసీపీ రవీందర్ తెలిపారు. జూమ్ సమావేశంలో ఎంపీ వెంకటేశ్నేతకాని, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్కుమార్ పాల్గొన్నారు.