న్యూఢిల్లీ, మార్చి 31: పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు అందాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ‘పన్ను చెల్లింపుదారుల ఇబ్బందుల దృష్ట్యా పాన్తో ఆధార్ అనుసంధానానికి జూన్ 30 వరకు గడువు పెంచాలని కేంద్రం నిర్ణయించింద’ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూన్లో పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. గతేడాది ఆగస్టు వరకు 32.71 కోట్ల పాన్లు ఆధార్తో అనుసంధానమయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… గతేడాది జూన్ 29 వరకు మొత్తం 50.95 కోట్ల పాన్లు కేటాయించారు.
ఇవి కూడా చదవండి:
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?