ఏవీఆర్ కాలనీని తాకని కొవిడ్ వైరస్
ఒక్క కేసూ నమోదు కాలేదు
సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ,తండావాసుల సహకారం
భూత్పూర్, జూన్ 7 : కరోనాతో దేశమంతా అల్లకల్లోలం అవుతుతున్నా.. ఆ కాలనీని మాత్రం తాకలేదు..అందరూ వైరస్ భయంతో వణికిపోతున్నా తండావాసులు భయపడలేదు.. సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ, గ్రామస్తుల సహకారంతో కరోనాను ఎక్కడికక్కడే కట్టడి చేశారు. ఒక్క పాజిటివ్ కూడా నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. మండలంలోని భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని ఏవీఆర్ కాలనీ(ఆలవెంకటేశ్వర్రెడ్డి కాలనీ)లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మండలంలో కూడా అన్ని గ్రామాల్లో, తండాలలో కేసులు నమో దు అవుతున్నా ఈ ఒక్క కాలనీలోనే కేసులు లేకపోవడంపై అంద రూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ సరైన అవగాహన కలిగి ఉండి సమన్వయంతో ప్రజలను ఏ విధంగా దారిలో పెడతారో తండాను వాసులను చూస్తే తెలుస్తుంది. తండాలో ఎక్కువ మంది విద్యావంతులు ఉండడం కూడా ఓ కారణం. 480మంది జనాభా ఉన్న ఆలవెంకటేశ్వర్రెడ్డి కాలనీ తండాలో ఒక్క కేసు నమోదు కాలేదంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం, గ్రామస్తుల పూర్తి సహకారం చైతన్యం కలిగి ఉండడమే కారణంగా చెబుతున్నారు.
మేం ఎక్కడికి పోం..
కరోనా వచ్చినప్పటి నుంచి మా తండావాసులందరు వేరే ఊర్లకు, తండాలకు వెళ్లడం మానుకున్నాం. మా తండాలో ఎక్కువ మంది పిల్లలు, ముసలివారు ఉన్నారు. బయటకు వెళ్లినా వెం టనే గ్రామ పంచాయతీ సిబ్బంది, సర్పం చ్ వెంటనే వచ్చి ఎక్కడి వెళ్లారని తెలుకొ ని వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. మా తండాలో ఇండ్లు కూడా విశాలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మాస్క్లను ధరిస్తున్నాం. అందుకే కరోనా రాలేదనుకుంటున్నాం.
పకీరా, తండావాసి