రామారెడ్డి, ఏప్రిల్ 7 : మండలంలోని అన్నారం ప్రభుత్వ దవాఖానలో బుధవారం 71 మందికి టీకాలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 57 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. మద్దికుంట గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ రాము తెలిపారు. రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 88 మందికి కొవిడ్ టీకాలను వేశామని డాక్టర్ షాహిద్ అలీ తెలిపారు. 187 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ విమలా భారతి, వ్యాక్సినేషన్ ఆఫీసర్ శ్రీధర్, శ్రీహరి, ల్యాబ్ టెక్నీషియన్లు శంకర్, పవన్, నర్సులు చంద్రకళ, గంగామణి, స్వాతి, భీమ్, లింబమ్మ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 7 : పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పది మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రవీంద్ర మోహన్ తెలిపారు. మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 9 మందికి కరోనా పాజిటివ్ చెప్పారు.
తాడ్వాయి, ఏప్రిల్ 7 : మండలంలోని ఎర్రాపహాడ్ పీహెచ్సీలో 115 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏడు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయని మండల వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. 86 మందికి కరోనా టీకాలు వేశామని తెలిపారు.
రాంపూర్ గ్రామంలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం
పిట్లం, ఏప్రిల్ 7 : మండలంలోని రాంపూర్ ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని వైద్యాధికారి శివకుమార్ బుధవారం ప్రారంభించారు. మొదటిరోజు 80 మందికి కొవిడ్ టీకాలు వేశామని, మొదటగా రాంపూర్ సర్పంచ్ నారాయణరెడ్డి వ్యాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. వ్యాక్సిన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి రోహిత్కుమార్, సూపర్వైజర్ మాణిక్యమ్మ పాల్గొన్నారు.
ఐసొలేషన్ వార్డు పరిశీలన..
బీర్కూర్, ఏప్రిల్ 7 మండలంలోని సంగెం గ్రామంలో ఐసొలేషన్ వార్డును నస్రుల్లాబాద్ తహసీల్దార్ ధన్వాల్ పరిశీలించారు. గ్రామంలో బుధవారం 88 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో కరోనా బాధితుల సంఖ్య 71కి చేరిందని తెలిపారు. ఆయన వెంట ఎస్సై మశ్చేందర్రెడ్డి, ఎంపీవో రాము, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఇవీ కూడా చదవండీ…
కరోనాపై 3 నెలల యాక్షన్ ప్లాన్!
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
7 సార్లు గెలిచినా.. తాగునీరివ్వలేదు