హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) శనివారం ‘డిజిటల్ డిస్కనెక్ట్.. ఎన్విరాన్మెంట్ రీకనెక్ట్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు 2 గంటల చొప్పున వారంపాటు సోషల్మీడియా సహా డిజిటల్ డివైజ్లకు డిస్కనెక్ట్ అయి ఉండటం దీని సారాంశం. పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ టాస్క్ లోగోను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్కుమార్ మక్తాల శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీటా ఉపాధ్యక్షుడు రాణా ప్రతాప్ బొజ్జం తదితరులు పాల్గొన్నారు.