మహబూబ్ నగర్ : కరోనా రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అమెరికా తెలుగు సంఘం (ఆట) ఉచితంగా ఇవ్వటం అభినందనీయమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నారైలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇవ్వాలని తాను సోమవారం పత్రికా ముఖంగా కోరిన తక్షణమే స్పందించి ఆట (అమెరికన్ తెలుగు సంఘం) ఈ విధమైన సహకారం అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సుమారు 20 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మంగళవారం ఆట ఆధ్వర్యంలో ఆట అధ్యక్షుడు అనిల్ బోధి రెడ్డి, సుధీర్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆట సీనియర్ అడ్వై జర్, టీవీ నటుడు లోహిత్ కుమార్, కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించి 5 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను మంత్రికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
చాలామంది కొవిడ్ రోగులకు ఆసుపత్రిలో ఆక్సిజన్ తో చికిత్స అందించినప్పటికి వారి ఇళ్లకు వెళ్లి న తర్వాత ఇబ్బంది పడకుండా ఇలాంటి ఆక్సిజన్ కాన్సెంట్రేట్ ల ద్వారా భయం లేకుండా చికిత్స అందించవచ్చు అని తెలిపారు. దీంతోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్లు కూడా చాలా ముఖ్యమని అన్నారు.
కొవిడ్ రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, ఆట కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు