హైదరాబాద్: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్ దరఖాస్తు గడువును పొడిగించింది. 2020–21లో నాలుగో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 3 నుంచి 15వ తేదీవరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. పూర్తి వివరాలకు టోల్ఫ్రీ నంబర్ 1800 425 45678కి కాల్చేయాలని సూచించారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేస్తారు.
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ- 18,560
గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777
బీసీ సంక్షేమ సొసైటీ- 20,800
జనరల్ వెల్ఫేర్ సొసైటీ- 2800
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 15
రాతపరీక్ష: మే 30న
వెబ్సైట్: tgcet.cgg.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..