గోమా (కాంగో), మే 23: మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని నైరాగోంగో అగ్నిపర్వతం శనివారం రాత్రి బద్ధలైంది. నిప్పులుగక్కుతూ ప్రవహిస్తున్న లావా గోమా పట్టణంలోని 500కు పైగా ఇండ్లను భస్మీపటలం చేసింది. అగ్నికీలలు విరుచుకుపడుతుండటంతో లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువైంది. ఈ క్రమంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతి పర్యవేక్షణ మిషన్లో భాగంగా కాంగోలో ఉన్న భారత సైన్యం సహాయక చర్యలను ప్రారంభించింది.