‘మిషన్’ వేగం..తీరనున్న దాహం g శరవేగంగా పట్టణ ‘మిషన్ భగీరథ’ పనులు
సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట పట్టణాల్లో 70శాతం పనులు పూర్తి
రూ.82.59 కోట్లతో మున్సిపాలిటీల్లో పనులు
మంత్రి హరీశ్రావు ఆదేశాలతో సంగారెడ్డికి అదనపు ట్యాంకు మంజూరు
తీరనున్న తాగునీటి ఇబ్బందులు
సంగారెడ్డి, మే 24 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ శుద్ధినీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథ కం
రాష్ట్రంలో విజయవంతమైన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా
తాగునీరు సరఫరా అవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్లోని మారుమూల ప్రాంతాల గ్రామాలకు సైతం మిషన్
భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నది. సం గారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట ము న్సిపాలిటీల్లో
ఇంటింటికీ తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూడు పట్టణాల్లో ప్రస్తుతం
ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది. కొన్నిచోట్ల పైప్లైన్ పనులు పూర్తయిన చోట మిషన్ భగీరథ ద్వారా
ప్రజలకు తాగునీరు అందజేస్తున్నారు. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీల్లో 50 శాతానికి పనులు పూర్తయ్యాయి. మరికొన్ని
రోజుల్లో సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట మున్సిపాలిటీల్లో పనులు పూర్తి కానున్నాయి. అక్టోబర్లో మూడు
మున్సిపాలిటీల్లో వందశాతం మిషన్భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కానున్నది. ఇటీవల ఆర్థిక మంత్రి హరీశ్రావు మూడు
మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను
ఆదేశించారు. ట్యాంకుల నిర్మాణం, పైప్లైన్ల పనుల్లో వందశాతం నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రభుత్వం
రూ.82.59 కోట్లతో ఈ మూడు మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులు చేపడుతున్నది. నీటి సరఫరా కోసం మూడు
మున్సిపాలిటీల్లో 8500 లీటర్ల సామర్థ్యం కలిగిన 14 ట్యాంకులు నిర్మించడంతో పాటు 205.87 కిలోమీటర్ల పైప్లైన్ పనులు
చేపడుతున్నారు. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీల్లో ఐదు ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యాయి. 139 కిలోమీటర్ల మేర పైప్లైన్
పనులు పూర్తిచేశారు. అక్టోబర్ నాటికి వందశాతం పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.