అకాల వర్షాలతో నష్టం
వరి, మక్కజొన్న రైతులకు తిప్పలు
కల్లాల్లోనే తడిసిన వడ్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభావం
వరంగల్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. చేతి కొ చ్చిన పంట నీటిపాలైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పంట నష్టం తీవ్రంగానే ఉంది. మూడు రోజులుగా అ క్కడక్కడా వానలు కురుస్తున్నాయి. ప్రతి రోజూ సా యంత్రం ఉరుములు, గాలిదుమారంతో వానలు పడు తున్నాయి. గురువారం, శుక్రవారం సైతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్కడక్కడా వానలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. వరి, మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గాలితో వచ్చిన వానలతో మక్కజొన్న నేలవాలింది. కర్రలు మళ్లీ నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు పచ్చి కంకులనే అమ్ముకోవాల్సిన పరి స్థితి వచ్చింది. పుష్కలంగా సాగునీరు ఉండడంతో యాసంగిలో వరి సాగు బాగా పెరిగింది. ఉమ్మడి వరం గల్ జిల్లాలో 6.47 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతు లు సాగు చేశారు. రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16.85 లక్షల టన్నుల దిగు బడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు చెబు తున్నాయి. నీటి వసతి ఉండడంతో ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా కొన్ని ప్రాంతాల్లో ముందుగానే వరి నాట్లు వేశా రు. అవన్నీ ఇప్పుడు కోతలకు వచ్చాయి. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో కోతలు ముమ్మరంగా సాగు తున్నాయి. ఇలాంటి తరుణంలో అకాల వానలు వరి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కోతకు వచ్చిన వరి అడ్డం పడుతోంది. దీంతో హార్వెస్టర్లతో కోసేందుకు ఇ బ్బందవుతోంది. ఇప్పటికే వరి కోసిన రైతులకు అకాల వర్షాలతో కష్టాలు వస్తున్నాయి. తేమ పోయేందుకు వడ్లను ఆరబోస్తే వానలతో తడుస్తున్నాయి. వడ్లకు సరి పడా కల్లాలు, టార్పాలిన్లు రైతుల వద్ద లేకపోవడంతో త డుస్తున్నాయి. వీటిని ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మామిడి, మిర్చి..
గాలిదుమారంతో మామిడి కాయలు రాలుతున్నా యి. మిరిప పండ్లు రాలిపోతున్నాయి. అకాల వాన లతో ఈ రెండు పంటల రైతులూ ఇబ్బంది పడుతు న్నారు. 30 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిన పరి స్థితుల్లోనే నష్టం అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఇప్పటి వరకు పంట నష్టం 30 శాతం దాటలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్ప టికప్పుడు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి వానలతో నేలరాలిన మక్క జొన్న, వరి, మామిడి, మిరప పంటల రైతులకు ఎప్ప టికప్పుడు సూచనలు చేస్తున్నారు.