న్యూఢిల్లీ: చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్ సినోఫామ్ను తమ దేశంలో వినియోగించేందుకు వియత్నాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో దేశంలో వినియోగానికి వియత్నాం ప్రభుత్వం ఆమోదించిన మూడో వ్యాక్సిన్గా అది నిలిచింది. ఇప్పటికే బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు, రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్కు వియత్నాం ఆమోదం తెలిపింది. తాజాగా వ్యాక్సిన్తో కలిపి ఇక నుంచి వియత్నాం ప్రజల కోసం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. కాగా, ఈ ఏడాది చివరి నాటికి తమ దేశంలోని మొత్తం 9.8 కోట్ల జనాభాలో 75 శాతం మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వియత్నాం సర్కారు పేర్కొన్నది.