కోల్కతా: యాస్ తుఫాన్ దూసుకొస్తుండటంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం మమత బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేగాక రాత్రికి సెక్రటేరియట్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం మమత బెనర్జి నిర్ణయించుకున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నది.
ఈ తుఫాన్ కాసేపట్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అది అతి తీవ్ర తుఫాన్గా మారి రేపు ఉదయం ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని, తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.
తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాలపై ఎక్కువగా.. జార్ఖండ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై స్వల్పంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.