కంటోన్మెంట్, జూలై 11: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నియోజకవర్గంలోని బోయిన్పల్లి చిన్నతోకట్ట, నక్కల బస్తీలో ఎమ్మెల్యే నిధులు రూ.11లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, స్థానికులు కొండల్, అశోక్, కృష్ణ గౌడ్, పరమేశ్, నిత్య, సీతారాం, శ్రావణ్, రాజేశ్ పాల్గొన్నారు.