వాషింగ్టన్: అమెరికన్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.. అగ్రరాజ్య వైద్య శాఖలో కీలక అధికారి.. బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమైన అధికారి.. కానీ ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆయననూ వదిలి పెట్టలేదు.
దీని బారిన పడి వివేక్మూర్తికి చెందిన పది మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రతి అమెరికన్ తమను తాము రక్షించుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ వివేక్ మూర్తి హితవు చెబుతున్నారు. వ్యాక్సినేషన్పై శషబిషలు అక్కర్లేదని, స్వేచ్ఛగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.
తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. హెల్త్ సమాచారం షేరింగ్ విషయంలో విశ్వసనీయ శాస్త్రీయ వనరులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అమెరికాలో 16 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు.
కానీ లక్షల మంది అమెరికన్లకు రక్షణ లేదన్నారు. వ్యాక్సినేషన్ చేయించుకోని వారు భారీగా ఇన్ఫెక్షన్ పాలవుతున్నారని డాక్టర్ వివేక్ మూర్తి గురువారం మీడియాకు చెప్పారు.
ప్రతి కరోనా మరణం తనకు బాధకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సర్జన్ జనరల్గా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు.
‘కోవిడ్ వల్ల నేను పది మంది కుటుంబ సభ్యులను కోల్పోయా. ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకునే అవకాశం పొందాలని కోరుకుంటా’ అని చెప్పారు.
ఇద్దరు పిల్లల తండ్రిగా తాను వారిని వైరస్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ చేయించడానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అమెరికాలో పిల్లలకు వ్యాక్సినేషన్ అనుమతించలేదు.
కోర్టుకే కాదు, ఎక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్ రాయ్ ఫైర్
హిందూ మహా సముద్ర ప్రాంతానికి బ్రిటన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్
టూ వీలర్స్ కు అద్దాలు తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు
2023 చివరిలోగా అయోధ్య ఆలయంలో భక్తుల పూజలకు అనుమతి
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో డెల్టా వేరియంట్ వల్లే 80 శాతం మందికి ఇన్ఫెక్షన్
Ola electric scooter : ఓలా బైక్ బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్లు ఇవే