ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిలకడగా ఆడుతోంది. అరంగేట్ర బౌలర్ చేతన్ సకారియా వేసిన మూడో ఓవర్లో మయాంక్ అగర్వాల్ ఔటవడంతో పవర్ ప్లేలో ఆచితూచి ఆడింది. క్రీజులో కుదురుకున్నాక ఓపెనర్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ ధనాధన్ బ్యాటింగ్తో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. గేల్ మాత్రం బౌండరీలు లక్ష్యంగా విజృంభిస్తున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం గేల్(39), రాహుల్(26) క్రీజులో ఉన్నారు. ఈ జోడీని విడదీసేందుకు రాజస్థాన్ బౌలర్లు శ్రమిస్తున్నారు.