అందరూ భాగస్వాములవ్వాలి:జాయింట్ కలెక్టర్ సీతారామారావు
జడ్చర్లటౌన్, జూలై8: హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని జాయింట్ కలెక్టర్ సీతారామరావు చెప్పారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 9,15,27 వార్డుల్లో గురువారం ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అంతకు ముందు జడ్చర్ల-మహబూబ్నగర్ ప్రధాన రహదారి పక్కన మొక్క నాటారు. కార్యక్రమంలో కమిషనర్ సునీత, కౌన్సిలర్లు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పండుగలా ..
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పండుగ వాతావరణంలో హరితహారం నిర్వహించారు. 3వ వార్డులో కౌన్సిలర్ సతీశ్ పర్యవేక్షణలో పార్కు స్థలంలో మొక్కలు నాటారు. 13వ వార్డులో కౌన్సిలర్ నందకిశోర్గౌడ్, 15వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పాలాది సారిక, 25వ వార్డులో కౌన్సిలర్ లత, 23వ వార్డులో కౌన్సిలర్ ఉమాశంకర్గౌడ్, 22వ వార్డులో కౌన్సిలర్ శ్రీశైలమ్మ ఇంటింటికెళ్లి మొక్కలు పంపిణీ చేశారు.
మొక్కలు నాటి సంరక్షించాలి:జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి
బాలానగర్, జూలై8: మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలు తీసుకొని రేపటి తరాలకు స్వచ్ఛమైన వాతావరణం ఇచ్చేందుకు కృషి చేద్దామని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఎర్రకుంటతండా, కేతిరెడ్డిపల్లి, బోడగుట్టతండా, మొదంపల్లి, ఏడుగుట్లతండా, తిరుమలగిరిల్లో పల్లె ప్రగతి పనులో భాగంగా పర్యటించి మొక్కలు నాటి నీళ్లు పోశారు. వాయిల్కుంటతండా, ఉటుకుంటతండా, వనమోనిగూడ గ్రామాల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ కల్యాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శివానందరెడ్డి, లక్ష్మణ్నాయక్ ఉన్నారు.
కొనసాగుతున్న పల్లెప్రగతి
మిడ్జిల్, జూలై8: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని భైరంపల్లి, వేముల, కొత్తపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఆయనవెంట ఎంపీడీవో సాయిలక్ష్మీ, ఎంపీవో అనురాధ, సర్పంచ్ మల్లమ్మ, జంగయ్య, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు బీరయ్య, కాడయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
మొక్కలు నాటిన జెడ్పీ వైస్ చైర్మన్
జడ్చర్ల, జూలై8: జడ్చర్ల మండలంలోని పోచమ్మగడ్డతండా, కొత్తతండాలలో గురువారం జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య మొక్కలను నాటారు. ముందుగా తండాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం మొక్కలను నాటారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, ఎంపీడీవో స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచులు రమేశ్నాయక్, యాదమ్మ, హరిశ్చందర్నాయక్, గిరియాదవ్, పాండు, బద్య, ఏఈలు జవహర్బాబు, మాల్యానాయక్, విజయకుమార్ ఉన్నారు.
పనులను పరిశీలించిన జెడ్పీ సీఈవో
జడ్చర్ల, జూలై8: జడ్చర్ల మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను గురువారం జెడ్పీ సీఈవో జ్యోతి, బాదేపల్లి పీఏసీసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్గౌడ్ పరిశీలించారు. మాటుబండతండా, గొల్లోనిదొడ్డి తండాల్లో పర్యటించారు. మాటుబండతండాలో గ్రామస్తుల సహాయంతో రోడ్డును చదును చేశారు. గొల్లోనిదొడ్డితండాలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. క్రిమిటోరియం, సెగ్రిగేషన్ షెడ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, సర్పంచ్ పాండు, పీఆర్ ఏఈ జవహార్బాబు, హలీం ఉన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి:ఎంపీపీ రమాదేవి
దేవరకద్ర రూరల్, జూలై8: పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలు తీసుకోవాలని ఎంపీపీ రమాదేవి కోరారు. మండలంలోని పుట్టపల్లి, కౌకుంట్ల, ఇస్రంపల్లి గ్రామాల్లో గురువారం అధికారులతో కలిసి పల్లె ప్రగతిలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలు పంపిణీ చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనులలో ప్రజలు భాగస్వాములై సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు స్వప్న, శ్రీనివాసులు, శివరాజు, కార్యదర్శి చంద్రశేఖర్, సింధు పాల్గొన్నారు. లక్ష్మిపల్లి గ్రామంలో తాసిల్దార్ జ్యోతి పల్లెప్రగతిలో పాల్గొని సమస్యలను గుర్తించి, వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తాసిల్దార్ వెంట సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎస్సై భగవంత్రెడ్డి పాల్గొన్నారు. జీనుగురాలలో సర్పంచ్ కడారి శ్యాంసుందర్రెడ్డి, ఎంపీటీసీ తిరుపతయ్య గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు.
భాగస్వాములు కావాలి
హన్వాడ, జూలై8: పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ రేవతి అన్నారు. గురువారం మండల కేంద్రంలో శ్రమదానం చేపట్టి ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో కార్యదర్ళి వెంకటయ్యగౌడ్, ఉప సర్పంచ్ గంగాపూరి, ఆర్ఐ ప్రవీణ్, అధికారులు వేణు, కృష్ణచారి పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో గ్రామాలు
పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయని ఉమ్మడి గండీడ్ మండల జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగా గురువారం ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. ఉమ్మడి గండీడ్, మహ్మదాబాద్ మండలాల పరిధిలోని జక్లపల్లి, జిన్నారం, జిన్నారంతండా, చౌదర్పల్లి పెద్దతండా, గువ్వనికుంట తండాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు కాంతమ్మ, ఖాజప్ప, బాల్యనాయక్, పార్వతమ్మ, శ్రీదేవి, శాలినిబాయి, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సలీం పాల్గొన్నారు.