అమరావతి: తిరుమలలో అర్ఛకుల వివాదాలు మరోసారి కోర్టు గడప తొక్కాయి. ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును నియమించడాన్ని సవాల్ చేస్తూ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. వేణుగోపాల దీక్షితులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, రమణదీక్షితులుకు నోటీసులు జారీచేసింది.