దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలో మంత్రి ఈటల
చిక్కడపల్లి, ఏప్రిల్ 3: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అం దరిపై ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సాయుధ పోరాట యోధు డు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా హాజరైన ఈటల మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాల సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్యామ మల్లేశ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, దొడ్డి కొమురయ్య మనువడు దొడ్డి చంద్రం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’