పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత
పరకాల, మే 9: కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్నందున పట్టణ ప్రజలు నిబంధనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం చైర్పర్సన్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకూ కరోనా వైరస్ విస్తరిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలుంటే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలన్నారు. పట్టణంలో మినీ లాక్డౌన్ అమలు చేస్తున్నామని, వ్యాపారులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే షాపులు నిర్వహించుకోవాలని కోరారు. పట్టణంలోని ప్రతి వార్డులో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు సోదా రామకృష్ణ ఉన్నారు.
భయం వద్దు.. ధైర్యమే ముద్దు..
గీసుగొండ: కరోనా పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలని తెలంగాణ సైకాలజిస్ట్ అసోషియేన్ అధ్యక్షుడు మురళీధర్రావు అన్నారు. కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ఫోన్లో ఉచిత కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారు కింద ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. డాక్టర్ మిథున్గౌడ్ 9394659865, డాక్టర్ శ్రీవిద్య 95055 53636, డాక్టర్ రజిత 8317595612, డాక్టర్ పూర్ణిమ 9121749009, డాక్టర్ సురేశ్ 80082 00870, డాక్టర్ దివ్యభారతి 9908843105, డాక్టర్ మురళీధర్రావు 9949069596 నంబర్లకు ఫోన్ చేసి ఎలాంటి సందేహాలు ఉన్నా నివృతి చేసుకోవాలని కోరారు. మనిషిని ధైర్యమే బతికిస్తుందని ఆయన సూచించారు.