కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రెచ్చగొట్టే, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీపై 24 గంటల ప్రచార నిషేధం విధించిన ఈసీ.. తాజాగా బీజేపీ నేత రాహుల్ సిన్హాపై 48 గంటల నిషేధం విధించింది. అటు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్కు నోటీసులు జారీ చేసింది. కూచ్ బెహార్ కాల్పుల ఘటనపై వీళ్లు చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది.
ఈ కాల్పుల్లో నలుగురు కాదు 8 మంది చనిపోవాల్సింది అని రాహుల్ సిన్హా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ.. వెంటనే ఆయన ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ ఈ నిషేధం విధించారు. రాహుల్ సిన్హా బీజేపీ తరఫున హబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్కు కూడా నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10 లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ తృణమూల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తనపై 24 గంటల నిషేధాన్ని నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు.
ఇవి కూడా చదవండి
స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర ఎంత? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
IPL 2021: అతన్ని 16 కోట్లు పెట్టి కొన్నది ఇందుకేనా?
ప్రపంచంలో ఆ 8 మంది దగ్గరే 75 లక్షల కోట్ల సంపద
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ వింత యాక్షన్ చూశారా.. వీడియో
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ