న్యూఢిల్లీ: చరిత్రలో తొలిసారి భారత్ తరఫున నలుగురు సెయిలర్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఒమన్ వేదికగా జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ముసానా సెయిలింగ్ చాంపియన్షిప్లో సత్తాచాటిన విష్ణు శరవణన్, గణపతి చెంగప్ప – వరుణ్ టక్కర్ టోక్యో విశ్వక్రీడల్లో బెర్త్ దక్కించుకున్నారు. బుధవారం ఇదే టోర్నీ లేజర్ రేడియల్ విభాగంలో అదరగొట్టి ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన తొలి భారత మహిళా సెయిలర్గా నేత్ర కుమారన్ నిలిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన పురుషుల లేజర్ స్టాండర్డ్ క్లాస్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి విష్ణు శరవణన్ టోక్యో టికెట్ పట్టాడు. అనంతరం 49 ఈఆర్ క్లాస్ విభాగంలో భారత ద్వయం చెంగప్ప – టక్కర్ అగ్రస్థానంలో నిలిచి ఒలింపిక్స్ చేరారు.