హైదరాబాద్ : నగరంలోని నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలోని అడిక్మెట్లో ఓ నవ వధువు అదృశ్యమైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతి(20)కి అడిక్మెట్ వాసితో ఈ ఏడాది మే 30వ తేదీన వివాహమైంది. అయితే ఆమె ఈ నెల 22వ తేదీన అత్తగారింట్లో ఎవరికీ చెప్పకుండా.. బట్టలు, బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయింది. నవ వధువు అదృశ్యమైనప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం వెతికారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వివాహిత భర్త, అత్తమామలు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.