47వ జాతీయ జూనియర్ టోర్నీ ప్రారంభం
సూర్యపేట, నమస్తే తెలంగాణ: జాతీయ జూనియర్ 47వ కబడ్డీ చాంపియన్షిప్ సూర్యపేట లో సోమవారం ప్రారంభమైంది. దేశవ్యాపంగా 29 రాష్ర్టాలతో పాటు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)కు చెందిన ప్లేయర్లు మార్చ్ఫాస్ట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసేలా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తల్లి సావిత్రమ్మ పేరిట నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ టోర్నీలో తొలి రోజు పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలికల విభాగంలో సాయ్తో జరిగిన మ్యాచ్లో తెలంగాణ 47 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. బాలుర కేటగిరీలో కర్ణాటక (49) 16 పాయింట్ల తేడాతో తెలంగాణ (33)పై విజయం సాధించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ దీపికా యుగంధర్రావు, జ్ఞానేశ్వర్, జగదీశ్వర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.