వాషింగ్టన్: జనవరి ఆరో తేదీన అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి దృశ్యాలను చిత్రీకరించి, వాటిని మీడియా సంస్థలకు అమ్మిన జాన్ ఎర్తీ సులివాన్ నుంచి అమెరికా అధికారులు సుమారు 90 వేల డాలర్లు సీజ్ చేశారు. ఉటాక్కు చెందిన అతను క్యాపిటల్ హిల్పై దాడి జరిగిన రోజున అక్కడ ఉన్నారు. జర్నలిస్టుగా దాడి ఈవెంట్ను కవర్ చేసేందుకు వచ్చినట్లు చెప్పుకున్న సులివాన్.. ఆ తర్వాత క్యాపిటల్ హిల్ లోపల జరిగిన హింసాత్మక ఘటనలను షూట్ చేశాడు. ఆ ఫూటేజ్ మొత్తాన్ని అతను మీడియా సంస్థలకు 90 వేల డాలర్లకు అమ్ముకున్నట్లు తెలిసింది. గత ఏడాది అమెరికాలో జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో అతను పాల్గొన్నాడు. అతనిపై మొత్తం 8 నేరాభియోగ కేసులను నమోదు చేశారు. క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో మొత్తం 440 మందిపై కేసు బుక్ చేశారు. సులివాన్తో పాటు అనేక మంది దాడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు.