పాలేరు నియోజకవర్గంలో 98శాతానికి పైగానే రికవరీ
వేగంగా వ్యాక్సినేషన్
ఆస్పత్రుల వద్ద బారులుతీరుతున్న ప్రజలు
కొవిడ్పై కంగారు వద్దంటున్న వైద్యులు
కూసుమంచి, ఏప్రిల్ 23: కరోనాపై ఆందోళన అక్కర్లేదు.. పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి ఆరోగ్యం క్షీణించదు.. కరోనా రికవరీ రేటు చాలా ఎక్కువ ఉండడమే దీనికి నిదర్శనం. కూసుమంచి మండలంలో 98శాతం రికవరీ ఉన్నట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. కొవిడ్ పరీక్షలు పకడ్బందీగా చేస్తున్నామని, వ్యాక్సినేషన్నూ వేగవంతం చేస్తున్నామంటున్నారు.
టీకాకు డిమాండ్..
వ్యాక్సినేషన్పై ప్రజల్లో అవగాహన ఏర్పడడంతో టీకాకు డిమాండ్ పెరిగింది. ఒక్కో పీహెచ్సీ నుంచి రోజుకు 150 మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వగా సిబ్బంది నిబంధనలు పాటిస్తున్నారు. కూసుమంచి పీహెచ్సీలో శుక్రవారం వరకు 1,900 మందికి వ్యాక్సిన్ అందింది. టీకా తీసుకున్న వారిపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. టీకా వేసిన తర్వాత 30 నిమిషాల పాటు ఆస్పత్రి ఆవరణలోనే ఉంచుతున్నారు. ఇప్పటివరకు వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, పోలీసులకు టీకా కార్యక్రమం పూర్తి కాగా ఇప్పుడు ప్రజలందరికీ టీకా వేస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకా ఇవ్వనున్నారు.
టీకాకు ముందు ర్యాపిడ్ టెస్టు ..
గతంలో వైద్యసిబ్బంది ఎలాంటి టెస్టులు నిర్వహించకుండానే టీకా ఇచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించాకే టీకా ఇస్తున్నారు. శుక్రవారం నాటికి 8,438 మందికి వైద్య పరీక్షలు చేయగా వారిలో 1,038 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
14 రోజులకు సరిపడా మందులు..
టీకా తీసుకోవాలని వచ్చే వారికి ముందుగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లేదా సాధారణ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి కూసుమంచి పీహెచ్సీ సిబ్బంది 14 రోజుల క్వారంటైన్కు సరిపడా మందులు ఇస్తున్నారు. ఈ మాత్రలలో ఆజిత్రోమైసిన్, మల్టీ విటమన్, పేరాసిట్మాల్, సెట్రిజెన్ ఉంటున్నాయి.
ఇవి కూడా చదవండి
కొవిడ్ టీకా ఓ రక్షణ కవచం.. నిర్లక్ష్యం తగదు : మంత్రి హరీశ్రావు
భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం : రైల్వేశాఖ