లండన్, సెప్టెంబర్ 4: కరోనా కాలంలో చాలా మంది బరువు పెరుగుతున్నారని, ఇలా పెరుగడం టైప్-2 డయాబెటిస్కు దారితీయొచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడంతో చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారని, ఈ సమయంలో అధిక ఆహారం తీసుకోవడంతోపాటు ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడంతో బరువు పెరిగారని తెలిపింది. అలాగే వైరస్ సోకకుండా ఉండటానికి పౌష్టికాహారం పేరుతో అధిక ఆహారం తీసుకుంటున్నారని, ఇది కూడా బరువు పెరుగడానికి ఓ కారణమని పేర్కొంది. అయితే ఇలా బరువు పెరుగడమనేది టైప్-2 డయాబెటిస్కు దారితీయొచ్చని హెచ్చరించింది. నేషనల్ హెల్త్ సర్వీస్ అంచనాల ప్రకారం ఒక కిలో లేదా 2.2 పౌండ్లు బరువు పెరిగితే డయాబెటిస్ వచ్చే ప్రమాదం 8 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. అధ్యయన వివరాలు ‘ది లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రినాలజీ’లో ప్రచురితమయ్యాయి.