సుల్తాన్బజార్ : క్యాబ్ను అద్దెకు తీసుకెళ్లి డ్రైవర్ను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను నాంపల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఖలీల్పాషా వివరాలు వెల్లడించారు.. రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన శివకుమార్ , ఇంతియాస్ ఖానం ఫేస్బుక్లో పరిచయ మై.. ప్రేమికులైయ్యారు. ఫిబ్రవరి 4న వారిద్దరు అఫ్జల్గంజ్ ప్రాం తంలోని ఓలాడ్జిలో దిగారు. ఈ నెల 4న వారిద్దరు నాంపల్లి రైల్వేస్టేషన్కు వెళ్లి క్యాబ్(ఏపీ11 2511)కి రూ.2500కు మాట్లాడుకుని డ్రైవర్ అస్లాంఖాన్తో బీదర్ బయల్దేరారు. మార్గమధ్యలో లింగంపల్లికి వెళ్లిన తర్వాత బీదర్, మణికెళ్లి ప్రాంతానికి చెందిన రవి కారు ఎక్కాడు. క్యాబ్ మణికెళ్లికి వెళ్లిన తర్వాత ఇంతియాస్ఖానం వాష్రూం వస్తుందనగా డ్రైవర్ అస్లాంఖాన్ క్యాబ్ను పక్క కు ఆపాడు. ఈ సమయంలో అస్లాంఖాన్ను శివకుమార్ కేబుల్ వైర్తో గొంతు నులిమి చంపారు. మృతదేహాన్ని అక్కడే పడేసి.. ట్యాక్సీతో వారు ముగ్గురు పరారై.. దాన్ని రూ.14వేలకు అమ్మేశారు. కాగా.. ఈ నెల 10న అస్లాంఖాన్ కనపడటంలేదని అతడి కుటుంబ సభ్యులు నాంపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు అఫ్జల్గంజ్లోని లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నారు. అస్లాంఖాన్కు భార్య, ఆరుగురు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.