కశ్మీర్, లఢక్ను భారత్ నుంచి వేరుచేస్తూ మ్యాప్
న్యూఢిల్లీ, జూన్ 28: జమ్ముకశ్మీర్, లఢక్ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించింది. ట్విట్టర్ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో ఉన్న ‘ట్వీప్ లైఫ్’ హెడర్లో వక్రీకరించిన ఈ మ్యాప్ను ప్రచురించింది. తాజా చర్యతో ట్విట్టర్ ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఎదుర్కోనుందని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో ట్విట్టర్ లేహ్ను చైనా భూభాగంగా చూపించి విమర్శల పాలైంది.