పేట్ బషీరాబాద్ : కొంపల్లి ఫ్లైఓవర్పై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొంపల్లి అశ్రిత ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రమేశ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న డాక్టర్ వాహనానికి అడ్డుగా బర్రె రావడంతో ప్రమాదం జరిగింది. దీంతో రమేశ్ కిందపడగా.. మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ అతనిపై నుంచి దూసుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.