ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వలన వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. ఇక నిర్మాతలు సైతం రిలీజ్కు సిద్దంగా ఉన్న సినిమాలను పెండింగ్ పెట్టడం ఇష్టం లేక ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ప్రభాస్- పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని ప్రచారం నడుస్తుంది. జూలై 30న రాధే శ్యామ్ మూవీని థియేటర్లో విడుదల చేస్తాం అని మేకర్స్ ప్రకటించారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ సమయానికి థియేటర్స్ తెరవడం కష్టంగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ సినిమాను పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా, పే పర్ వ్యూ విధానంతో.. సల్మాన్ ఖాన్ రాధే: ది మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమాను మే 13న విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసిందే.