హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సామాన్యుల జీవితాలలోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వారా విభిన్నంగా స్పృశించిన గొప్ప రచయిత కారా అని సీఎం గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.