న్యూఢిల్లీ: హ్యుండాయ్ కంపెనీకి చెందిన సెవన్ సీటర్ ఎస్యూవీ అల్కజార్ ఇండియాలో శుక్రవారం లాంచ్ అయింది. గత వారమే దీనికి సంబంధించిన బుకింగ్స్ను సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే. రూ.25 వేలు కట్టి కారును బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఎస్యూవీ 6, 7 సీటర్లలో లాంచ్ అయింది. మ్యానువల్, ఆటోమమేటిక్ వేరియంట్స్లలో అందుబాటులో ఉంటుంది. ప్రెస్టిజ్, ప్లాటినం, సిగ్నేచర్ పేర్లతో మొత్తం 14 వేరియంట్లలో అల్కజార్ మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.16.3 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.