ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవ అభిశంసన వచ్చే నెలలో జరగనున్నది. సేనేట్లోని డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అభిశంసన విచారణను ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభంకానున్నది. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన అంశంలో ట్రంప్ను అభిశంసించాలని హౌజ్ తీర్మానించింది. అయితే సోమవారం రోజున సేనేట్కు ఆ తీర్మానాన్ని పంపనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఎటువంటి అభిశంసన విచారణ ఉండదని పేర్కొన్నారు. ఈ సమయంలోగా ట్రంప్ తన లాయర్లతో డిఫెన్స్ సిద్ధం చేసుకోనున్నారు. జనవరి ఆరవ తేదీన జరిగిన క్యాపిటల్ దాడి ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే జరిగినట్లు డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. క్యాపిటల్ ఘటనలో అయిదుగురు మృతిచెందారు.
గత ఏడాది కూడా ట్రంప్పై అభిశంసన జరిగింది. అధికార దుర్వినియోగం కేసులో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ సేనేట్లో ఆయన నిర్దోషిగా తేలారు. ఈ బుధవారమే ట్రంప్ పదవీ కాలం ముగిసింది. జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రంప్ హాజరుకాలేదు. శాశ్వతంగా మరో సారి అధ్యక్ష హోదాకు పోటీపడకుండా ఉండేందుకు డెమోక్రాట్లు ట్రంప్పై రెండోసారి అభిశంసనకు పట్టుబడుతున్నారు. అభిశంసన ప్రక్రియ నిష్పాక్షికంగా, సంపూర్ణంగా జరుగుతుందని సేనేట్కు చెందిన డెమోక్రాట్ నేత చక్ షూమర్ తెలిపారు.
తాజావార్తలు
- కమల్ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం