అనిల్ అంబానీ తనయుడి మండిపాటు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: తాజా లాక్డౌన్లపై ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబానీ మండిపడ్డారు. ఇవి చిరు వ్యాపారాలను, రోజువారీ కూలీలను దెబ్బతీస్తున్నాయని ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెటర్లు రాత్రి వరకు క్రికెట్ ఆడవచ్చని, రాజకీయ నాయకులు వేలాది మందితో సభలు నిర్వహించుకోవచ్చని, సామాన్యుల పని మాత్రం ఏమంత ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. లాక్డౌన్లు విధించడం ప్రజలపై అధికారం చలాయించడానికే తప్ప వారి ఆరోగ్యంపై శ్రద్ధ ఉండి కాదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్