నిజామాబాద్ : చావును మించిన దుఃఖం ఏముంటుంది. అదే ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతిచెందడం అంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ తీవ్ర విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం వాడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ కుటుంబ సభ్యులు నలుగురు కరోనా వైరస్ కారణంగా మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు పదకంటి లింబాద్రి(65), నర్సవ్వ(61). వీరికి ముగ్గురు కొడుకులు. దంపతులిరువురి కొవిడ్తో మృతిచెందగా వీరి రెండవ కుమారుడు సుదర్శన్(40) రెండు నెలలక్రితం కొవిడ్ పాజిటివ్తో చనిపోయాడు. దంపతుల మరో కొడుకు రమేశ్(45) సైతం మూడు రోజులక్రితం కొవిడ్ ఇన్ఫెక్షన్తోనే కాలం చేశాడు. దీంతో జిల్లా వైద్యారోగ్య అధికారులు వాడి గ్రామంలో కొవిడ్-19 క్యాంప్ను ఏర్పాటు చేసి గ్రామస్థులకు పరీక్షలు చేస్తున్నారు.