న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ మోడల్.. ఆల్ న్యూ టాటా సఫారీ.. 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారిక భాగస్వామిగా వ్యవహరించనున్నది. ఐపీఎల్ 14వ టోర్నీ వచ్చే నెల 9వ తేదీన ప్రారంభం కానున్నది. మే నెల 30వ తేదీన ముగుస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ఐపీఎల్-21 మ్యాచ్లు జరుగుతాయి.ఈ వేదికల వద్ద టాటా సఫారీని డిస్ప్లే చేయనున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
కరోనాతో ఏడాది పాటు కష్టాలను ఎదుర్కొన్న తర్వాత భారత వేదికలపై టోర్నీ జరుగుతున్నందుకు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ ఎంతో ప్రత్యేకమైందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ మార్కెటింగ్ అధిపతి వివేక్ శ్రీవత్స చెప్పారు. బీసీసీఐతో వరుసగా నాలుగో సంవత్సరం పూర్తిస్థాయి అనుబంధాన్ని పునరుద్ధరించుకున్నందుకు తాము థ్రిల్గా భావిస్తున్నట్లు తెలిపారు. ఇంతకుముందు 2018 ఐపీఎల్ టోర్నీలో టాటా నెక్సాన్.. 2019లో టాటా హరియర్, 2020 ఐపీఎల్ టోర్నీలో టాటా ఆల్ట్రోజ్ అధికారిక పార్టనర్లుగా వ్యవహరించాయి.
ఇటీవలే టాటా మోటార్స్ విపణిలో ఆవిష్కరించిన టాటా సఫారీతో ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో టాటా మోటార్స్తో తమ అనుబంధాన్ని కొనసాగించడానికి ముందు చూపుతో వ్యవహరిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ తెలిపారు. 2018 నుంచి టాటా మోటార్స్ తమ టోర్నమెంట్తో అధికారిక భాగస్వామిగా ఉందని, ఏడాదికేడాది తమ మధ్య బంధం బలోపేతం అవుతుందన్నారు.
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
భారత్లోకి జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు.. ధరెంతంటే!
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!